దాదాపు ముప్పై ఏళ్ల క్రితం భారత ప్రధానితో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
త్రోబ్యాక్ ఫొటోలతో ప్రముఖ రంగాలకు చెందిన వ్యక్తులు నెట్టింట వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల ఒకప్పటి ఫొటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. తమ అభిమాన నటీనటులను చూసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవాలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరుతున్నారు. 20, 30 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ ఫొటోలను చూసుకున్న వ్యక్తులు తమ జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ నాయకుల అభిమానులు కూడా మా నాయకులు అప్పట్లో ఇలా ఉండే వారా అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి ఆ లీడర్లు ఎవరో మీరు గుర్తు పట్టారా?
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి అఖండ విజయాన్ని అందుకుంది. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి తన మార్క్ పాలనతో ప్రజల ఆదరణ పొందారు. ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించి రెండవ సారి భారత ప్రధానిగా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. పేదరికాన్ని రూపుమాపి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెడుతున్నారు ప్రధాని మోడీ. కాగా 1994 లో తీసిన ప్రధాని మోడీతో ఉన్న ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో మోడీతో పాటు తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు ఉన్నారు. మరో తెలుగు నేత తమిళనాడు బిజెపి ఇంచార్జ్ గా ఉన్నారు. వారెవరో గుర్తొచ్చారా. మరెవరో కాదు వారే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఆ ఫొటోలో ఎడమ నుంచి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ ఉన్నారు. కుడి నుంచి మొదటి వ్యక్తి పొంగులేటి, కుడి నుంచి నాలుగో వ్యక్తి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే 1994 లో యూఎస్ లో జరిగిన పొలిటికల్ లీడర్స్ సదస్సుకు భారత్ నుంచి పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు వెళ్లారు. ఆ బృందంలో మోడీ, కిషన్ రెడ్డి, పొంగులేటి వెళ్లారు. ఆ పర్యటనలో తీసుకున్న ఫొటో కొందరు కిషన్ రెడ్డికి బహూకరించడంతో అప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.