ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన కంట ఏ అద్భుతం పడినా ఆ అద్భుతాన్ని వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన మరొక అద్భుతాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక వృద్ధురాలు ఈ వయసులో కష్టపడి జాతీయ జెండాను తమ ఇంటి ఎత్తులో కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగ‘ పేరిట ప్రతీ ఇంట జాతీయ జెండా ఎగరాలని తీసుకొచ్చిన నినాదానికి దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. చిన్నా, పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇళ్ళ మీద ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక వృద్ధ జంట తమ ఇంటి ముందు జాతీయ జెండాను కట్టి అందరి దృష్టిలో పడింది. కాంక్రీట్ స్థంభం నిర్మాణం కోసం ఏర్పాటు చేసే ఇనుప చువ్వలకి ఒక కర్రని కట్టి.. దానిపై జాతీయ జెండాను కట్టింది ఆ జంట. ఇనుప డ్రమ్ మీద ఎక్కి.. ఆ జెండాను ఆ వృద్ధురాలు కట్టారు. ఆమె పడిపోకుండా భర్త డ్రమ్ని పట్టుకుని సహాయం చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫోటో తీశారో గానీ ఇది ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆలస్యం చేయకుండా వెంటనే తన ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు ‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎందుకు ఇంత హడావుడి చేస్తారని మీకెప్పుడైనా ఆశ్చర్యం అనిపిస్తే.. ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప వ్యక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే గొప్పగా మీకు వీళ్ళు వివరిస్తారు. జై హింద్’ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వయసులో దేశభక్తిని చాటిన ఆ వృద్ధురాలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి ఈ జంట చేసిన పనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ
— anand mahindra (@anandmahindra) August 14, 2022