ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా, ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ అంటే కనీసం సినిమా కూడా కాదన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ చేసిన అతి పెద్ద మిస్టేక్సే. వాటిలో మొదటిది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం. ఆయన మరణిస్తే కనీసం ఒక్క పెద్ద స్టార్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. నెపోటిజం అనే నాలుగు గోడల మధ్యన నలిగిపోయింది సుశాంత్ జీవితం. అప్పటి వరకూ పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్కటి చేజారిపొయాయి. కారణం ఎవరో అనేది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నెపోటిజం చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈరోజు బాలీవుడ్ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తోంది. సుశాంత్ సింగ్కి కేవలం బాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆమిర్ ఖాన్ పీకే సినిమాలో సర్ఫరాజ్ యూసఫ్గా సుశాంత్ చేసిన నటన చిన్నదేమీ కాదు. గుండెల్ని కన్నీటి గోదావరిలో ముంచి తీసి పిండేసేంత గొప్పగా నటించారు. అదొక్కటేనా మనందరి అభిమాన క్రికెటర్ ధోని బయోపిక్లో సైతం జీవించి మనల్ని భావోద్వేగానికి గురి చేశారు. అలాంటి గొప్ప నటుడ్ని కోల్పోవడం బాలీవుడ్ చేసుకున్న పాపం. ఆయన మరణమే బాలీవుడ్కి శాపమైంది. సుశాంత్ మరణం నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ తేడాని మాత్రమే కాదు.. బాలీవుడ్ తలరాతను కూడా చెరిపేసింది. అప్పటివరకూ బాలీవుడ్ అంటే తోపు అన్న గీతని చెరిపేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ తలరాతను సుశాంత్ మార్చేశాడు. సుశాంత్ విషయంలోనే కాదు, ఇంకా అనేక విషయాల్లో బాలీవుడ్ తప్పులు చేస్తూ వచ్చింది. ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, బాలీవుడ్లో హిందూ వ్యతిరేక సినిమాలు పెరిగిపోవడం లాంటి కారణాలు బాలీవుడ్ని భూస్థాపితం చేశాయి. సుశాంత్ మరణంతో మొదలైన బాయ్కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ఇవాల్టి వరకూ నడుస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు.. అక్కడి ఆడియన్స్ ఎంతలా బాలీవుడ్ని డిజ్ఓన్ చేసుకున్నారో అనేది. ఒకప్పుడు ఆమిర్ ఖాన్ సినిమా అంటే కలెక్షన్ల పరంగా మొదటి ప్లేసులో ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' మూవీని బాలీవుడ్ ప్రేక్షకులు బాయ్ కాట్ చేశారు. అక్షయ్కుమార్ నటించిన రక్షాబంధన్ పరిస్థితి కూడా ఇంతే. ఇవే కాదు బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాలన్నీ ఘోర పరజయాన్ని మూటగట్టుకున్నాయి. బాలీవుడ్ నుండి ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ తిప్పికొడుతున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువవ్వడంతో బాలీవుడ్ ఘోరంగా పతనమైంది. సుశాంత్ సింగ్ మరణం నుంచి బాలీవుడ్ తలరాత మారిపోయింది. దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు, సినిమాల్లో హిందూ వ్యతిరేక సినిమా భావజాలం ఎక్కువవ్వడంతో అక్కడి ప్రేక్షకులు విసిగిపోయి ఇవాళ బాలీవుడ్ని పడుకోబెట్టేశారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. దేశం, మతం అనేవి సున్నితమైన అంశాలు. వాటిని టచ్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందనడానికి బాలీవుడ్డే నిదర్శనం. మరి బాలీవుడ్ ఇప్పటికైనా తన పంథా మార్చుకుని సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందో లేదో చూడాలి. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. బాలీవుడ్ తలరాతను మార్చేసిందని, ఆ శాపం ఇంకా బాలీవుడ్ని వెంటాడుతోందని మీరు నమ్ముతున్నారా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: Brahmaji: నేను పెళ్లి చేసుకున్న ఆమెకు అప్పటికే విడాకులు, ఓ బాబు ఉన్నాడు: బ్రహ్మాజీ ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!