ఈ మద్య కొంతమంది ఆకతాయిలు ఆడవారిని లైంగికంగా వేధించడం చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు ఎలాంటి మార్పు రావడం లేదు.
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోతున్న కామాంధులు చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. నిత్యం మహిళలై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ యువకుడు అందరి ముందే హస్తప్రయోగం చేసుకొని అతి జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.. ఆ ఘటన మరువక ముందే.. బస్సులో ఓ మహిళపై యువకుడు వికృత చేష్టలు చేస్తూ వేధించాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కేరళ.. కొజికోడ్ సమీపంలో చెవయూర్ కు చెందిన సవాద్ షా(27) అంగమాలి వద్ద త్రిస్సూర్ నుంచి కొచ్చికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అదే బస్సులో త్రిస్సూర్ కి చెందిన నందిత అనే మహిళ ప్రయాణిస్తుంది. ఆమె పక్క సీటు ఖాళీగా ఉండటంతో సవాద్ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు ఆమెను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆ మహిళలను అసభ్యంగా తాకడం.. పిచ్చి సైగలు చేయడం చేశాడు. అంతటితో ఆగకుండా మరీ దారుణంగా ప్యాంట్ జిప్ తీసి.. హస్తప్రయోగం చేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఏర్నాకులం జిల్లా మంగళవారం చోటు చేసుకుంది.
బస్సులో అతడి వికృత చేష్టలు భరించలేక మహిళ నిందితుడిని నిలదీసింది.. దాంతో ఆమెపై యువకుడు దురుసుగా ప్రవర్తించాడు. వెంటనే కండెక్టర్ కి ఫిర్యాదు చేసింది. నిందితుడిని మందలించిన కండెక్టర్ బాధితురాలని పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాడు. దాంతో కంగారు పడ్డ సవాద్.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆపడంతో అందరినీ తోసి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. దాంతో ప్రయాణికులు అతన్ని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఇటీవల బస్సు, ట్రైన్, మెట్రో రైల్ లో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.