ఈ మద్య చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ప్రతిరోజూ ఎక్కడో జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కనుక కరెంట్ షాక్ లతో పలువురు చనిపోతున్నారు.
మనిషి ప్రాణాలు ఎప్పుడు ఏ క్షణంలో పోతాయో తెలియదు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటారు పెద్దలు. ఈ మద్య కాలంలో గుండెపోటు మరణాలు, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళిపోతున్నారు. తాజాగా 24 ఏళ్ల యువకుడు జిమ్ లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా మరణించాడు. పోస్టు మార్టంలో సంచలన నిజాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే..
దేశరాజధాని ఢిల్లీలోని రోహణి ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. కేఎన్ కట్టూ మార్గ్ ప్రాంతంలో ఓ జిమ్ లో ట్రెడ్ మిల్ లో కరెంట్ సప్లై కారణంగా యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మంగళవారం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన 25 ఏళ్ల సాక్షం పృథి.. గురుగ్రామ్ లోని ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19 లో నివాసం ఉంటున్నాడు సాక్షం. ఫిట్ నెస్ కోసం సెక్టార్ 15 లోని ఉన్న జిమ్ ప్లెక్స్ కి క్రమం తప్పకుండా వెళ్తు ఉండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 7.30 ప్రాంతంలో జిమ్ కి వెళ్లి ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేస్తున్నాడు.
టెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తున్న సాక్షం పృథి.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన సిబ్బంది, తోటివారు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే సాక్షం మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. పోస్టు మార్టం రిపోర్ట్ లో విసృతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షం ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తుండగా కరెంట్ సప్లై అయి షాక్ తగలడం వల్ల మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి కేశవ్ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్ను అరెస్ట్ చేశారు. ఎంతో భవిష్యత్ ఉండి మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నతస్థాయియి ఎదుగుతాడని అనుకున్న తమ బిడ్డ అకస్మాత్తుగా చనిపోవడంతో సక్షం ఇంట్లో విషాదం నెలకొంది.