ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో దుర్మార్గాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, ఎదుటివారిని మోసం చేసి డబ్బు సంపాదించడం చూస్తూనే ఉన్నాం.
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, స్మగ్లింగ్, కిడ్నాపింగ్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల అక్రమాలు, దందాలకు పాల్పపడుతున్నారు. ఐఫోన్ కోసం కొంతమంది దుర్మార్గులు మహిళా టీచర్ ని రోడ్డు పై ఈడ్చుకువెళ్లిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చెటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలో ఈ మద్య వరుస చోరీలు, హత్యలు, అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళ పట్ల కొంతమంది బైకర్లు దారుణంగా వ్యవహరించారు. దీంతో ఆ మహిళ తీవ్ర గాయాల పాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యోవికా చౌదరి ఉపాధ్ాయురాలిగా పనిచేస్తుంది. ఆహె శుక్రవారం స్కూల్ పూర్తి అయిన తర్వాత ఆటోలో ఇంటికి వెళ్తుంది. ఆమె ఐఫోన్ వాడుతున్న విషయం కనిపెట్టిన కొంతమంది దుండగులు కొట్టేసేందుక దారునానికి పాల్పపడ్డారు. బైక్ లపై వచ్చి ఆటోలో వెళ్తున్న ఆమె వద్ద నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆమె ఆటోనుంచి కిందపడిపోయింది.. అయినా ఆమె అలాగే కొంత దూరం లాక్కుంటూ వెళ్లారు. వారితో పోరాడలేక ఆమె ఐఫోన్ వదిలివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె చేతులు, కాళ్లు, మొఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఈ దారుణానికి పాల్పపడినిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.