ఈ రోజుల్లో చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి వారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతటి తప్పిదాలనైనా చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా ఒంటరిగా కనబడిన వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆపై దొరికినంత దోచుకుంటున్నారు.
ఈ రోజుల్లో చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి వారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతటి తప్పిదాలనైనా చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా ఒంటరిగా కనబడిన వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆపై దొరికినంత దోచుకుంటున్నారు. చోరీలు చేయడంలో పోలీసులతో పాటుగా దొంగలు కూడా చాలా అప్ డేట్ అవుతున్నారు. తాజాగా కాషాయ వస్త్రాలను ధరించిన ఇద్దరు సాధువులు బిజీ ఏరియాల్లో యాచించినట్లు నటిస్తూ దొరికినంత దోచుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
రాజధాని నగరం అయిన ఢిల్లీలో ఉంటూ గురుగ్రామ్లో జనాలను మోసం చేస్తూ ఓ గ్యాంగ్ తిరుగుతుంది. సాధువుల వేషం ధరించి భక్తి అనే సెంటిమెంట్తో ప్రజలపై చోరీలకు పాల్పడుతున్నారు. ముందుగా డబ్బులు అడుగుతారు. వారు డబ్బులు తీసే లోపే జోలె నుండి పాములను చూపించి వారి దగ్గరున్న సొమ్ము లాక్కుంటున్నారు. కొద్ది రోజు క్రితం ఓ మహిళ తన అనుభవాన్ని తెలుపుతూ.. సెక్టార్ -52 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
తన వ్యక్తి గత పనుల కోసం బయటకు వచ్చింది. బిజీగా ఉన్న రోడ్ల మధ్య అతికష్టం మీద ఆమెకు ఓ ఆటో దొరికింది. దీంతో ఆటోలో కూర్చుని ఉంది. ఇంతలో ఇద్దరు సాధువుల వేషంలో వచ్చి అమ్మా దానం చేయండి.. మీకు మేలు జరుగుతుంది.. అంటూ వచ్చారు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి మనీ ఇస్తుండగానే జోలెలో నుంచి ఒక పామును బయటికి తీసి ఆమె ముఖం దగ్గరగా పెట్టి భయపెట్టారు. ఆమె సడన్గా పామును చూసి గట్టిగా కేకలు వేసింది. ఇంతలో సాధువులు ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాగేసుకుని..భగవంతుడు మీకు మేలు చేస్తాడు.. అంటూ ఆ బ్యాగుతో ఉడాయించారు. ఈ తరహా ఘటనలకు దొంగలు పాల్పడుతున్నారని తెలిపింది.