వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తుంది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. తనతో చాన్నాళ్లు కాపురం చేసిన ప్రియుడు వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కక్ష పెంచుకుంది. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తాయి అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. తనతో చాన్నాళ్లు కాపురం చేసిన ప్రియుడు వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కక్ష పెంచుకుంది. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది. చివరకు భార్య దగ్గరకు వెళ్లాడని తెలిసి ఆ ఇంటికి చేరుకుంది ప్రేయసి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చివరకు 11 ఏళ్ల బాబు ఉన్నాడు. దీంతో మరింత రగిలిపోయింది ఆ కసాయి మహిళ. గాఢ నిద్రలో ఉన్న బాబును చూసిన ప్రేయసి.. ఒక్కసారిగా మనస్సులో కీడు ఆలోచన చేసింది. బాలుడు గొంతు కోసి చంపి, అక్కడే ఉన్న బాక్సులో బట్టలు తీసి, అతడి మృతదేహాన్ని అందులో ఉంచి పరారైంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే. పూజకుమారి అనే మహిళ.. 2019లో జితేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అప్పటికే జితేంద్రకు పెళ్లై భార్య, కుమారుడు ఉన్నాడు. వారిని వదిలేసి పూజాకుమారితో ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత పూజకు జితేంద్రకు మధ్య గొడవలు కావడంతో.. అతడు తిరిగి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న పూజ..అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 10న జితేంద్ర ఉంటున్న ఇంటికి వెళ్లగా.. తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్లింది. అయితే ఆ ఇంట్లో జితేంద్ర కుమారుడు మంచంపై పడుకుని ఉన్నాడు. జితేంద్ర కనిపించలేదన్న కోపంతో బాబుని చంపి అక్కడే ఉన్న పెట్టేలో నుండి బట్టలు బయటకు తీసి.. మృతదేహాన్ని అందులో పెట్టి పరారైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. అనంతరం పూజను అరెస్టు చేశారు.