ముకేశ్ అంబానీ పరిచయం అవసరంలేని పేరు. భారత్లో అత్యంత ధనవంతుడు. దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటే.. ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి దూసుకెళ్లారు. రిలయన్స్ షేర్ల ర్యాలీ ఇందుకు ప్రధాన కారణం. అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. ఆయన రోజుకు ఈజీగా రూ. 300 కోట్లు సంపాదిస్తున్నారట. రోజుకు 100 రూపాయలు సంపాదించాలంటే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఈ అపరకుబేరుడు ఏకంగా రూ.300 కోట్లు సంపాదిస్తున్నట్లు బార్క్లేస్ హరున్ ఇండియా రిచ్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ముకేశ్ అంబానీ విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె మరెవరో కాదు భార్య నీతా అంబానీ. అయితే వీరి పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా వీరి పెళ్లి గురించి ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే వెంటనే వెళ్లి వారితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే తన తల్లి మాటను కాదనలేని ముకేశ్ అంబానీ తన ప్రేమలో పడ్డారు. పెళ్లికాకముందు నీతా అంబానీ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేసేది. ఈ క్రమంలోనే ఆమె కోసం ముఖేష్ అంబానీ కారు వదిలి బస్సులో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో నీతా అంబానీ తనని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ను పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా నీతా అంబానీ స్కూల్లో టీచర్ గా పని చేస్తానని, అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందని అప్పట్లో ముకేశ్ అంబానీకి షరతు పెట్టారు. ఈ విధంగా నీతా అంబానీ పెట్టిన షరతులకు ముఖేష్ ఒప్పుకోవడంతో ఆమె తన జీవితంలోకి వచ్చిందని రహస్యాన్ని ఓ సందర్భంలో బయటపెట్టారు. కొన్ని రోజుల పాటు స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఆమె ఆ తర్వాత రిలయన్స్ వ్యాపార బాధ్యతలను చేపట్టారు.