ఆసియా కుబేరుడు, కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కి సంబంధించి ఏ చిన్న న్యూస్ అయినా నెట్టింట ఇట్టే వైరల్ అవుతుంది.
భారతదేశంలో కార్పొరేట్ దిగ్గజం.. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2014లో ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు. రిలయన్స్ తో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ముకేశ్ అంబానికి భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా ఖరీదైన విల్లాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ముకేశ్ అంబానికి సంబంధించిన ఓ విలాసవంతమైన విల్లాను కళ్లు చెదిరే ధరకు అమ్మేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.
సాధారణంగా సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ గురించి ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన విల్లాలు ఉన్న విషయం తెలిసిందే. అంబానీకి చెందిన మాన్ హట్టన్ లోని ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆ ఇంటిని విక్రయించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ నివేధించింది. మాన్ హట్టన్ వెస్ట్ విలేజ్ లో ఉన్న అపార్ట్ మెంట్ లోని నాలుగవ ఫ్లోర్ లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఇంటిని 9 మిలియన్ డాలర్లకు ఆయన విక్రయించినట్లుగా పేర్కొంది. ఇది భారత కరెన్సీతో పోలిస్తే రూ.74.5 కోట్లకు విక్రయించినట్లు పేర్కొంది.
హడ్సన్ నదీ తీరంలో ఉన్న ఈ విల్లా 10 అడుగుల ఎత్తుల సీలింగ్స్, హెరింగ్ బోన్ హార్డ్ వుడ్ ఫ్లోర్స్ తో బయట నుంచి శబ్దం ఏమాత్రం లోపలి వినిపించకుండా ఉండేలా కిటికీల నిర్మాణం ఏర్పాటు చేసి ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటి నిర్మించారు. రెండు బెడ్రూంల నుంచి ఈ నదితో పాటు ప్రకృతి అందాలను వీక్షించేలా నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణం ప్రపంచంలోనే పేరుపొందిన హిల్లరీ స్వాంక్, జిమ్మీ జాన్సన్, మార్క్ జాకబ్స్ వంటి ప్రముఖులు డిజైన్ చేయడం మరో విశేషం. ఈ ఇంటి ఇంటీరియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు. నిపించకుండా నిరోధించే కిటికీలు వంటి సదుపాయాలు ఉన్నాయి. హిల్లరీ స్వాంక్, జిమ్మీ జాన్సన్, మార్క్ జాకబ్స్ వంటి ప్రముఖులు ఈ ఇంటికి తమ డిజైనింగ్ను జోడించడం విశేషం.