ప్రముఖ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ చెప్పిన విషయం తెలిసిందే. కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కెరియర్ బిగినింగ్ లో మోడలింగ్ చేసిన సమంత.. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల మయోసైటిస్ వ్యాధి భారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటుంది. ఈ మద్య సినిమాలకు బ్రేక్ ప్రకటించింది సమంత. ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే.. వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తాజాగా నటి సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో జరిగే వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. అంతేకాదు.. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్లో పాల్గొనే అవకాశం సమంతకు దక్కింది. దీనికి సంబంధించిన ఆహ్వానం సమంతకు అందినట్టు తెలుస్తుంది. సమంతతో పాటు నటుడు రవికిషన్, బాలీవుడ్ బ్యూటీ జాక్వైలిన్ ఫెర్నాండెజ్ లు ఉన్నారు. గత ఏడాది ఈ వేడుకకు బాలవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, సన్నిడియోల్, రవినా టాండన్ వెళ్లగా.. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నటి తమన్నా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. ‘శాకుంతలం’ మూవీ భారీ డిజాస్టర్ తర్వాత కొంతకాలం మూవీస్ కి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు అక్కడి అద్భుత దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఎప్పటికప్పుడు తన ఇన్స్ట్రాగామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు మయోసైటిస్ వ్యాధి భారిన పడి చికిత్స తీసుకుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమంతకు దక్కిన అరుదైన గౌరవానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.