పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది. ప్రియుడి కోసం ఇక్కడే ఉంటానని, చావనైన చస్తాను గాని పాక్ కు తిరిగి వెళ్లనని చెప్పింది సీమా హైదర్. ఆ తర్వాత భారత నిఘా వర్గాలు ఆమెను పాకిస్తాన్ కు చెందిన గూఢాచారి అన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దేశంలో సంచలనంగా మారిన అన్ లైన్ గేమ్ పబ్జీ ప్రేమ వ్యవహారానికి చెందిన సీమా హైదర్, తన భర్త సచిన్ మీనాతో కలిసి హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఎమోషనల్ నినాదాలు చేసింది.
సీమా హైదర్ తన భర్త సచిన్ మీనాతో కలిసి నోయిడాలో ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో పాల్గొంది. త్రివర్ణ చీరను ధరించి అందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. హిందుస్తాన్ జిందాబాద్.. పాకిస్తాన్ డౌన్ డౌన్.. అంటూ ఎమోషనల్ అవుతూ భారత్ మాతా కీ జై అంటూ స్లోగన్స్ చేసింది. ఆ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లు ఉచ్చరిస్తూ జై అంటూ నినాదాలు చేసింది. ఇదిలా ఉంటే.. అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమా హైదర్ ను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు సచిన్ ను జూలై 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
सीमा हैदर ने लगाए पाकिस्तान मुर्दाबाद के नारे, लगाए हिंदुस्तान जिंदाबाद के नारे
◆ वीडियो हुआ सोशल मीडिया पर वायरल
Seema Haider | #SeemaHaider pic.twitter.com/1q6qAlWC5V
— News24 (@news24tvchannel) August 14, 2023