ఏ మాయ చేసావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు సినిమా అగ్రకథానాయికగా ఎదిగిన హీరోయిన్ సమంత. లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి.
ఏ మాయ చేసావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు సినిమా అగ్రకథానాయికగా ఎదిగిన హీరోయిన్ సమంత. లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి. విజయ్ దేవరకొండ ఆ మూవీలో హీరో. మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదలకు సిద్ధమైన క్రమంలో చిత్ర నిర్మాతలు ఖుషి ప్రమోషన్స్ ని ఒక లెవల్లో స్టార్ట్ చేసారు. ఈ టైం లో సమంత హఠాత్తుగా న్యూయార్క్ వెళ్లిపోవడం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.
విజయ్ దేవరకొండ,సమంత కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ హిట్ అవ్వడం విజయ్ దేవరకొండ,సమంత,శివ నిర్వాణ ముగ్గురికి చాలా అవసరం. ఎందుకంటే ఆ ముగ్గురి గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలబడ్డాయి. ముగ్గురు కూడా చాలా కసిగా ఈ ఖుషి మూవీ చేసారని ఇండస్ట్రీ టాక్.
ఇంక సినిమా విడుదల సమయం దగ్గర పడే కొద్దీ మేకర్స్ ఖుషి ప్రమోషన్స్ లో వేగం పెంచారు. లేటెస్టుగా మూవీకి సాంగ్స్ కి సంబంధించిన మ్యూజిక్ కాన్సెర్ట్ ని నిర్వహించారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ లో విజయ్ అండ్ సమంతలు ఫుల్ ఎనర్జీ తో మ్యూజిక్ కాన్సెర్ట్ లో పాల్గొని అటు ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులకి కుడా ఖుషిని పంచి సినిమా మీద అమాంతం అంచనాలని పెంచారు. అలాగే విజయ్ తో కలిసి సమంత చేసిన డాన్స్ కూడా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. వాళ్ళిద్దరి డాన్స్ చూసిన వాళ్ళందరూ విజయ్ అండ్ సమంత ల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా కుదిరిందని చెప్పుకున్నారు. అలాగే ఒకరి పర్సనల్ లైఫ్ గురించి ఒకరు కూడా చెప్పారు. ఖుషి సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ విజయ్, సమంత ల ప్రమోషన్స్ ఇంకొక రేంజ్లో ఉండబోతున్నాయని అందరు భావించారు.
కానీ సమంత సడెన్ గా న్యూయార్క్ వెళ్ళిపోయింది. ఈ వార్త విన్న సమంత, విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ కి గురయ్యారు. రెండు రోజుల క్రితమే సమంత ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ లో పాల్గొని విజయ్ తో డాన్స్ కూడా చేసిందని తాను న్యూయార్క్ వెళ్ళటం రూమర్ అని అందరూ భావించారు. కానీ సమంత నిన్న నైట్ న్యూయార్క్ తన తల్లితో కలిసి వెళ్ళింది.మయోసైటీస్ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న సమంత న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం తన తల్లితో కలిసి బయలుదేరి వెళ్ళింది.ఇంకో ఆరు నెలల దాకా సమంత న్యూయార్క్ లోనే ఉంటుంది. సో.. ఇంక ఖుషి ప్రమోషన్స్ కి సమంత బై బై చెప్పినట్లే.