విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఖుషి పాటలకు మంచి హైప్ రావడంతోపాటు ఇప్పుడు విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గీతగోవిందంతో సక్సెస్ కొట్టి యూత్ కి క్రేజీ హీరోగా మారిపోయారు. కాగా ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొడ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఖుషి సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తికరంగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందులో కశ్మీర్ లో సమంత, విజయ దేవరకొండల మధ్య పుట్టిన లవ్ తో భార్యాభర్తలుగా మారుతారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవలు, భావోద్వేగాలు చుట్టు కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో పెళ్లంటేనే చావురా అని రాహుల్ రామకృష్ణ చెప్పిన డైలాగ్, భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చెబుతున్నా అని విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన సాంగ్స్ యూత్ ను ఊపేస్తున్నాయి.