ఇటీవల దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు అనేక మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. ప్రాజెక్టు వర్క్స్ తగ్గటంతో పాటు ఇతర కారణాలతో బడా సంస్థలు కూడా తమ ఉద్యోగులను లే ఆఫ్ చేశాయి
ఇటీవల దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు అనేక మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. ప్రాజెక్టు వర్క్స్ తగ్గటంతో పాటు ఇతర కారణాలతో బడా సంస్థలు కూడా తమ ఉద్యోగులను లే ఆఫ్ చేశాయి. అటు ఉద్యోగులను నియమించుకునే సంఖ్య కూడా తగ్గింది. దీంతో రెసిషన్ టైమ్ పీక్స్కు చేరింది. ఇలాంటి సమయంలో బడా సంస్థలో ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ సంస్థ ఏంటో తెలుసా.. ఆసియాలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండ్రస్టీలో. కేవలం ఏడాదిలో సుమారు లక్షా 60వేల మంది రాజీనామా చేశారంటే.. మామూలు విషయం కాదు.
రిలయన్స్లో ఉద్యోగం వచ్చిందంటే సంతోషపడేవాళ్లు ఎక్కువ. అలాంటి కంపెనీని వదిలి వెళ్లిపోవాలని ఎవరైనా భావిస్తారా. కానీ అదేంటో ఏడాదిలోనే లక్ష అరవై వేల పై చిలుకు ఉద్యోగులు.. కంపెనీకి రాం రాం పాడేశారు. టెలికాం రంగం నుండి రిటైల్ రంగం వరకు ఈ పరంపర కొనసాగింది. 2022-23 వార్షిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ రంగం నుండి 1,19,229 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తే.. జియో నుండి 41,818 మంది వైదొలిగారు. ఇక పెట్రోలియం రంగం, క్లాత్ రంగం నుండి మరికొంత మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. రిలయన్స్ వార్షిక నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. రిలయన్స్ అట్రిషన్ శాతం(ఉద్యోగాలు వీడే వారి శాతం) 64.8 శాతానికి పెరిగింది. దీని కారణం స్టారప్లని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్.. పలు స్టార్టప్స్, ఇతర సంస్థలను కొనుగోలు చేసింది. దీంతో ఆయా కంపెనీల్లో రోల్స్ సేమ్ అయ్యాయి. అంటే సేమ్ జాబ్స్ రిపీట్ అయ్యాయి. దీంతో బెటర్ ఆప్షన్, కొత్త రోల్స్ చూసుకుని.. వేరే కంపెనీల్లోకి మారిపోతున్నారు ఉద్యోగులు. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్ స్థాయి నుంచి మిడ్ మేనేజ్ మెంట్ స్థాయి ఉద్యోగులే ఉన్నారు. అయితే ఖర్చులు తగ్గించేందుకు రిలయన్స్ కొంత మంది ఉద్యోగులను స్వతహాగా తప్పుకోమని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులు కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నియామకాల్లో కూడా రికార్డు సృష్టించింది రిలయన్స్. 2023 ఆర్థిక సంవత్సరలో కంపెనీ మొత్తం 2,62,558 మంది ఉద్యోగులను నియమించుకుంది, 2022 వార్షిక సంవత్సరంలో 2,32,822గా ఉండగా.. ఇప్పుడు 30 వేల ఉద్యోగులకు పైగా తీసుకుంది.