ముఖేష్ అంబానీ ఏం చేసినా స్పెషలే. వారి కుటుంబానికి సంబంధించిన ఎంత చిన్న వార్త అయినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసునిగా వ్యాపార రంగంలో టాప్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఓ గుడ్న్యూస్ అందించారు.
ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఆయన మన భారతీయుడు కావడం మనకు గర్వకారణం. ఈ బిలియనీర్ ఏం చేసినా స్పెషలే. వారి కుటుంబానికి సంబంధించిన ఎంత చిన్న వార్త అయినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసునిగా వ్యాపార రంగంలో టాప్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఓ గుడ్న్యూస్ అందించారు. ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారత్ లో 5G స్పెక్ట్రమ్ను రూ. 88,078 కోట్లకు కన్ఫామ్ చేసింది. పోయిన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ శుభవార్త గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
5G స్పెక్ట్రమ్ కొరకు రెండో వాయిదా రూ. 7864 కోట్లను టెలికాం డిపార్ట్మెంట్కు చెల్లించాల్సి ఉంది. దీనికంటే ముందే ఆకాష్ అంబానీ శుభవార్త తెలిపారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్డ్ సర్వీస్ ఆసియాలో 5జి నెట్వర్క్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది. పోయిన ఏడాది కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ కోసం కంపెనీ అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్లలో అనుకున్నదానికంటె ముందే ఈ లాంచ్ను పూర్తి చేసింది. Jio 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్లలో స్పెక్ట్రమ్తో అతిపెద్ద స్పెక్ట్రమ్ పరిధిని కలిగి ఉంది. దీనితో పాటు జియో కి చెందిన 5G నెట్వర్క్ చాలా స్పీడ్ గా ఉంది. రిలయన్స్ జియో 5జి ప్రారంభానికి సంబంధించిన వివరాలను పోయిన నెలలో టెలికాం శాఖకు సమర్పించింది. ఆగస్టు 11 నాటికి అన్ని సర్కిళ్లలో టెస్టింగ్లను కూడా పూర్తి చేసింది.
అధిక నాణ్యత గల 5జి సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో ఛైర్మన్, ఆకాష్ అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్ర స్థానానికి తీసుకెళ్లినట్లు తెలిపేందుకు గర్విస్తున్నామన్నారు. గత సంవత్సరం నుండి 5జి స్పెక్ట్రమ్ వచ్చిన తర్వాత, ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఈ నెట్వర్క్ను స్టార్ట్ చేసేందుకు ప్రణాళికతో నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలయన్స్, ఎయిర్టెల్ మాత్రమే దేశం మొత్తం 5జి సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ కంపెనీలు 5జి నెట్వర్క్ను ప్రారంభించిన 10 నెలల్లోనే మూడు లక్షలకు పైగా సైట్లలో ప్రారంభించబడింది. ఇప్పుడు దేశంలోని దాదాపు 714 జిల్లాల్లో ఈ నెట్వర్క్ ప్రారంభమైంది.