హిందువుల పండుగలలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైంది. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని..జరుపుకునే పండుగనే ఈ దీపావళి పండుగ. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న భారతీయులు అందరూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను చేసుకుంటారు.
హిందువుల పండుగలలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైంది. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని..జరుపుకునే పండుగనే ఈ దీపావళి పండుగ. ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను మతంతో పని లేకుండా అందరూ ఈ పండుగను చేసుకుంటారు. అయితే భారతదేశంలో ఉన్నవాళ్లు మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సైతం దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. చీకటిని పాదద్రోలుతూ వెలుగులు ఇచ్చే పండగగా అని హిందువులు బాగా ఆచరిస్తారు . అయితే ఇప్పుడు తాజాగా అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న భారతీయులు అందరూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను చేసుకుంటారు.
ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ రాష్ట్రసభ సభ్యులు మేయర్ ఎరిక్ ఆడమ్స్ దీపావళిని ప్రజల సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను తాజాగా అదికార ప్రకటనగా తెలియజేశారు. ఈ మేరకు నిన్న సోమవారం రోజున అదికారికంగా ప్రకటనగా విడుదల చేశారు. అలా తెలియజేయడం వలన ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉందని.. న్యూయార్క్ లో ఉన్న స్థానిక ప్రజలు మేము విజయాన్ని సాధించాము అని మేయర్ ఎరిక్ పేర్కోన్నారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేసామని.. ఆ సెలవు కోసం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్ కుమార్, ఆ సంఘం నాయకులు అందరూ అండగా నిలిచినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అయితే ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి మాకు దీపావళి పండుగా ఇప్పుడే వచ్చినట్లు ఉంది అని మేయర్ ఎరిక్ ట్వీట్ చేశారు. ఇంకా అంతేకాదు.. ఈ బిల్లును గవర్నర్ కాథీ హెూచుల్ ఆమోదిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.