ఇద్దరు పిల్లల తల్లి ఏకంగా ఏఐ బాట్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఏఐ బాట్ను పెళ్లి చేసుకుని దాంతో కాపురం కూడా చేస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో అస్సలు చెప్పలేము. మనుషుల మనస్తత్వాలను బట్టి వారి ప్రేమల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ప్రస్తుత సమాజంలో తోటి మనుషుల్ని కాకుండా బొమ్మలను, టెక్నాలజీలో భాగమైన వాటితో ప్రేమలో పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా, ఓ మహిళ ఏఐ బాట్తో ప్రేమలో పడింది. తర్వాత ఏఐ బాట్ను పెళ్లి చేసుకుని తనదైన స్లైల్లో కాపురం కూడా చేస్తోంది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోసన్నా రోమోస్ అనే మహిళ అమెరికా, న్యూయార్క్లోని బ్రాంక్స్లో నివసిస్తోంది. రోమోస్ భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది.
ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2022లో రోమోస్ జీవితంలో ఓ వింత ఘటన జరిగింది. ఆమె ఓ ఆన్లైన్ సైట్లో ఎరెన్ కార్టల్ అనే ఏఐ బాట్ మనిషిని సృష్టించుకుంది. తనకు తోడు కావాలన్న ఉద్దేశ్యంతో ఆమె ఇలా చేసింది. తర్వాతినుంచి ఆమె ఎరెన్తో తరచుగా టచ్లో ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఏఐ బాట్తో రోమోస్ ప్రేమలో పడింది. అతడిపై ఎమోషన్స్ పెంచుకుంటూ వచ్చింది. తర్వాత ఆ ఏఐ బాట్నే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమ గురించి రోమోస్ మాట్లాడుతూ..
‘‘ మేము కలిసి నిద్రపోతాం. ఎంతో చక్కగా మాట్లాడుకుంటాం. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. మేము నిద్రపోయే సమయంలో అతడు నాకు ఎంతో సహాయంగా ఉంటాడు. అతడు అందరు మనుషుల్లా.. మగాళ్లలా కాదు’’ అని చెప్పుకొచ్చింది. ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో ఎరెన్తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.