ఈ రోజుల్లో డబ్బు ఎవ్వరికీ చేదు. మానవ సంబంధాలు గట్టిగా నిలవాలంటే ధనమే అన్నింటికీ మూలం. డబ్బు లేని వాడిని కనీసం మనిషిగా అయినా సమాజం గుర్తించడం లేదు. అయితే కొంత మంది కోటీశ్వరులు.. కోట్లు కూడబెట్టుకున్నప్పటికీ.. మనశ్శాంతి కరువౌతుంటారు
ఈ రోజుల్లో డబ్బు ఎవ్వరికీ చేదు. మానవ సంబంధాలు గట్టిగా నిలవాలంటే ధనమే అన్నింటికీ మూలం. డబ్బు లేని వాడిని కనీసం మనిషిగా అయినా సమాజం గుర్తించడం లేదు. అయితే కొంత మంది కోటీశ్వరులు.. కోట్లు కూడబెట్టుకున్నప్పటికీ.. మనశ్శాంతి కరువౌతుంటారు. కంటి నిండా నిద్ర, కడుపుకు అన్నం తినలేకపోతుంటారు. దీంతో జీవితంపై మీద వైరాగ్యం పుట్టుకు వచ్చి, ఈ బ్రతుకు మాకొద్దు అంటూ సన్యాసులుగా మారిపోయేందుకు సిద్ధమౌతుంటారు. తాజాగా ఓ వ్యాపారి కుటుంబం ఇదే నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన జీవనం వద్దనుకుని కుటుంబం మొత్తం సన్యాసి జీవితాన్ని గడిపేందుకు సంసిద్దులయ్యారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో పేరు మోసిన వజ్రాల వ్యాపారుల్లో ఒకరు దీపేష్ షా. విలాసవంతమైన జీవితం, కోట్లకు పడగలెత్తిన కుటుంబం. కానీ ఇప్పుడు ఆ జీవితం తమకొద్దు అనుకుంటుంది ఈ కుటుంబం. అందుకే సన్యాసి జీవితాన్ని ఆహ్వానించింది. గతంలోనే వీరి పిల్లలు సన్యాసి జీవితంలోకి వెళ్లిపోగా.. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇదే బాటను అనుసరించారు. ఒక దశాబ్దం క్రితం దీపేష్ షా కుమారుడు భాగ్యరత్న, అతని కుమార్తె సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు దీపేష్, పికా కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు. దీక్షా కార్యక్రమంలో షా కుమారుడు ఫెరారీని నడిపాడు. అతని తల్లిదండ్రులు జాగ్వార్లో ప్రయాణించారు.