గుజరాత్ ప్రభుత్వం ఒక కొత్త నిబంధనకు తెరలేపనుంది. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేసింది.
ఒకప్పుడు ప్రేమించాలంటేనే భయపడే యువత ఇప్పుడు ప్రేమలో మునిగి తేలిపోతున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధాలకన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో క్రమంగా సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువవుతున్నాయి. ఆడ, మగ పరస్పర అంగీకారంతో ఇష్టపడి ఇద్దరూ మేజర్లు అయితే వారు ఎవరి అనుమతి లేకుండా వివాహం చేసుకునే అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం. ఎప్పటినుంచో ఈ నియమం అమలు చేస్తున్నారు. ఈ రూల్ వల్ల ఎందరో తల్లి తండ్రుల అనుమతి లేకపోయినా ధైర్యంగా ప్రేమ వివాహాలు చేసుకొని తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారు. అయితే ఈ రూల్ తల్లి తండ్రులకి మాత్రం కాస్త ప్రతికూలంగా మారుతుంది. అయితే ఇప్పుడు వారికి ఊరటను ఇస్తూ ప్రేమ పెళ్లిపై ఒక కీలక నిర్ణయం తెలుకురానుంది గుజరాత్ ప్రభుత్వం.
గుజరాత్ ప్రభుత్వం ఒక కొత్త నిబంధనకు తెరలేపనుంది. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో తల్లితండ్రుల ఆమోదం తప్పనిసరి చేసింది. పిల్లలు ప్రేమించుకోవడంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా వారు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం తల్లి తండ్రుల ఒప్పించాలని తేల్చేసింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. మోహనశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కే విధంగా నిబంధనలు తీసుకురావాలని పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు సీఎం భూపేంద్ర పటేల్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలన్న అంశానికి సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతుంది? ఈ నిబంధనకు అవకాశం ఉంటుందా ?లేదా? అనే విషయంపై పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్ తీసుకొస్తే తాము ఆమోదం తెలుపుతామని స్పష్టం చేసింది. త్వరలో ఈ విషయానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.