ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. వాటిని అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి రాంగ్ రూట్లలో వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు పట్టించుకోకుండా అలాగే వెళుతుంటారు.
డ్డుపై వెళ్లే వాహనాలు సరైన పద్ధతిలో నడిపిస్తే ఎవరికి ఏ ప్రమాదం జరుగదు. కానీ కొందరు తొందరగా గమ్యస్థానాలను చేరేందుకు రాంగ్ రూట్లలో బండ్లు నడుపుతారు. ఇలా చేయడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. రాంగ్ రూట్లలో బండ్లు నడుపొద్దని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాసినా, ఫైన్లు వేసినా వాహనదారులు పట్టించుకోవడంలేదు. అధికారులు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ రూల్స్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించినా కూడా కొంతమంది త్వరగా వెళ్లేందుకు రాంగ్ రూట్లలోనే ప్రయాణిస్తుంటారు. దీంతో రాంగ్ రూట్లలో రయ్మని వెళ్లేవారికి చెక్ పెట్టేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధికారులు వినూత్న ఉపాయం ఆలోచించారు. అదేంటంటే..
వాహనాలు వెళ్లే రూట్లో టైర్ కిల్లర్స్ను అమర్చారు. కరెక్ట్ వేలో వెళ్లేవారికి వీటి ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాదని రివర్స్లో వెళ్లిన వారికి వాహనాల టైర్లు బ్లాస్ట్ అవుతాయి. కత్తుల్లా ఉన్న ఇనుప చువ్వలు టైర్లకు దిగి టైర్ పేలిపోతుంది లేదా పంచరవుతుంది. రాంగ్ రూట్లో వెళ్లొద్దని ఎంత చెప్పినా వినని వారికి ఈ విధంగా బుద్ది చెబుతున్నారు అధికారులు.
ఇంతకు ముందే ఇటువంటి టైర్ కిల్లర్స్ను మహారాష్ట్ర పూణెలో కూడా అమర్చారు. కానీ ఎమర్జెన్సీగా అంబులెన్స్లు వస్తే వీటితో ప్రాబ్లం అవుతుందని టైర్ కిల్లర్స్ని తీసేశారట. ఇక రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారికి తగిన శాస్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు. అయినా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ మన కోసమే కదా.. వాటిని పాటించి మన ప్రాణాలను సేఫ్గా ఉంచుకోవాలని మన మైండ్ సెట్ చేసుకోవాలి కానీ అధికారులు వారికి వీలైనంత వరకు మాత్రమే చెప్తారు.