గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎయిర్ పోర్టులో కూడా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు జిల్లాల్లో కాలనీలు జలమయం అయ్యాయి. నదులు, వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కుండపోత వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్నవానలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
టెర్మినల్ ఏరియాతోపాటు రన్వే పైకి కూడా వరద నీరు వచ్చింది. దీంతో ప్రయాణికులు వారి ఫ్లైట్ చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు నీళ్లలో నడవాల్సి వచ్చింది. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గురించి నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టులో ప్రస్తుతం విమానాల కంటే పడవలు ఈజీగా పరుగులు తీస్తాయలని కామెంట్ చేస్తున్నారు. దాదాపు 200 మంది ఎయిర్ పోర్టు సిబ్బంది శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వర్షాల కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి పోయింది. గుజరాత్ రాష్ట్రంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.flood
కాగా, వరద నీటితో పలు ప్రాంతాలు నీట మునిగి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదైయ్యాయి. నవసారిలో 30 సెం.మీ., జునాగఢ్లో 21.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 24 వరకు సౌరాష్ట్రలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
నిన్న శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్#AhmedabadRain #AhmedabadRains #AhmedabadAirport #GujaratRain pic.twitter.com/twbwdBcBUo
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2023