దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే సాధారణ కుటుంబాలకు ఉచిత రేషన్ పథకం నుంచి పీఎం కిసాన్ వరకు రకరకాల సదుపాయాలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 1.4 కోట్ల కుటుంబాలకు శుభవార్త తెలియజేసింది. ప్రతి నెల ఉచిత అన్నపూర్ణ ఫుడ్ కిట్ పథకాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
రాజస్థాన్ రాష్ట్రంలో ఉచిత అన్నపూర్ణ ఆహార కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా పప్పులు, చక్కెర, ఉప్పు, ఎడిబుల్ ఆయిల్, కారం, కొత్తిమీర, పసుపుతో కూడిన అన్నపూర్ణ కిట్ ను ప్రతి నెల పొందవచ్చు. దీంతో 1.04 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలన్నింటిని సామాన్య ప్రజలకు చేకూర్చడమే ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. అన్నపూర్ణ ఫుడ్ కిట్లో ఒక కిలో పప్పు, చక్కెర, అయోడైజ్డ్ ఉప్పు, ఒక లీటరు సోయాబీన్ రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్, 100 గ్రాముల కారం పొడి, కొత్తిమీర, 50 గ్రాముల పసుపు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఆరు నెలలుగా రేషన్ పంపిణీని సక్రమంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్నపూర్ణ ఆహార పంపణీ కిట్లు పంపిణీ చేసే రేషన్ డీలర్ల కమీషన్ ప్యాకెట్ రూ. 4 నుంచి రూ. 10కి పెంచామన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనితో పరిపాలనా, ఆర్థిక రంగ పనులు వేగవంతం అవుతాయి అని చెప్పారు. కోటి మందికి నెలకు కనీసం రూ. 1000 సామాజిక భద్రత పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ స్మార్ట్ ఫోన్ యోజన కింద మొదటి దశలో 40 లక్షల మంది బాలికలు, మహిళలకు స్మార్ట్ ఫోన్లు అంందిస్తుంది. 2030నాటికి రాజస్థాన్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చి దిద్దాలని గెహ్లాట్ తెలిపారు.