వందలు, వేలు మాత్రమే ఉండే అకౌంట్లలో ఉన్నట్లుండి.. వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షమైతే.. అంత డబ్బు చూసిన సంతోషంలో గుండె పోటు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి సంఘటనే యూకేలో చోటు చేసుకుంది. కొందరి బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్లుండి.. వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షం అయ్యాయి. అది కూడా క్రిస్మస్ రోజున చోటు చేసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శాంతానే వారికి బహుమతి రూపంలో ఇంత డబ్బు ఇచ్చినట్లు భావించారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఆ డబ్బులను డ్రా చేయడానికి లేకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టింది బ్యాంక్. సాంకేతిక లోపం వల్ల.. ఈ సమస్య తలెత్తినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని రికవరీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి : బస్సు ప్రమాదంలో 22 మంది మృతి! డ్రైవర్ చేసిన ఆ ఒక్క తప్పే కారణం!
యూకే కి చెందిన ‘శాంటాండర్’ బ్యాంకు సర్వర్లలో ఏర్పడిన లోపం వల్ల దాదాపు 2 వేల మంది కార్పొరేట్, వాణిజ్య ఖాతాదారుల అకౌంట్లకు సంబంధించి 75,000 రూపాయల చెల్లింపులు రెండు సార్లు జరిగాయి. అయితే, అవి వారి అకౌంట్ నుంచి కాకుండా.. నేరుగా బ్యాంకుకు చెందిన డబ్బు కట్ అయ్యింది. మరికొందరికి కూడా తక్కువ మొత్తంలో సొమ్ము బదిలీ అయ్యింది. షెడ్యూలింగ్లో ఏర్పడిన లోపం కారణంగా నగదు బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి : ప్రధాని భార్య కారుపై కాల్పులుఅయితే, జరిగిన పొరపాటును త్వరగా గుర్తించి సరిదిద్దామన్నారు బ్యాంకు అధికారులు. క్రిస్మస్ రోజున పొరపాటున బదిలీ అయిన 175 మిలియన్ డాలర్ల సొమ్మును(12,63,61,00,000 రూపాయలు) తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే, ఈ డూప్లికేట్ లావాదేవీలను రాబట్టడం తలకు మించిన బారంగా మారింది అంటున్నారు నిపుణులు. ఖాతాదారులు ఒక వేళ ఆ సొమ్మును ఖర్చు చేసినట్లయితే.. ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్తుందని బ్యాంకు పేర్కొంది. ఎవరి ఖాతాలో అయితే నిధులు జమ అయ్యాయో వారి నుంచి నేరుగా ఆ నిధులను రికవరీ చేయడానికి బ్యాంకులకు ఒక ప్రొసీజర్ ఉంటుందని, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు తెలిపారు.