ఎవరికైనా డబ్బు పంపాలన్నా, డబ్బులు దాచుకోవాలన్నా, నగదును తీసుకోవాలన్న బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4-5 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకు నుండి డబ్బులు తేవాలన్నా, డిపాజిట్ చేయాలన్న వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదే.
ఎవరికైనా డబ్బు పంపాలన్నా, డబ్బులు దాచుకోవాలన్నా, నగదును తీసుకోవాలన్న బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4-5 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకు నుండి డబ్బులు తేవాలన్నా, డిపాజిట్ చేయాలన్న వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదే. బ్యాంకు పని దినాల తర్వాత డబ్బు కావాలంటే మాత్రం ఏటీఎంలకు వెళ్లాల్సిందే. బ్యాంకులకు సెలవు అయితే ఎవ్వరికైనా డబ్బులు వేయాలన్నా, మనం పొందాలన్నా కష్టతరమే. అటువంటి సమయంలో మన చేతుల్లోకి వచ్చింది మాయా పేటిక. ఆన్ లైన్ యాప్ల ద్వారా చిటికెలో డబ్బులు బదిలీ అయిపోతున్నాయి. అటువంటి యాప్స్లో ముందు వరుసలో ఉంటుంది గూగుల్ పే.
మొబైల్ ఫోన్స్ వాడే 100 మందిలో 90 మంది దగ్గర కచ్చితంగా గూగుల్ పే ఉంటుంది. అనేక సేవలను అందిస్తుంది ఈ యాప్. మీ దగ్గర కూడా గూగుల్ పే ఉన్నట్లయితే ఈ శుభవార్త మీ కోసమే. ఒక్క శుభవార్త కాదండోయ్ రెండు. గూగుల్ పే తన వినియోగదారుల కోసం కొత్త సర్వీసులు తీసుకు వచ్చింది. పిన్ లేకుండా మనీ ట్రాన్స్ ఫర్, పేమెంట్స్ చేయోచ్చు. గూగుల్ పే యూపీఐ లైట్ అనే సర్వీసును తీసుకువచ్చింది. మీరు పిన్ లేకుండానే దీని ద్వారా లావాదేవీలు జరపచ్చు. యాప్ను ఓపెన్ చేసి.. టాప్ రైట్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ పిక్పై ట్యాప్ చేయాలి. అనంతరం ‘పే పిన్ ఫ్రీ యుపీఐ లైట్’పై క్లిక్ చేయాలి. యూపీఐ లైట్ బ్యాలెన్స్కు డబ్బును వేసేందుకు ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించాలి. ఆ తర్వాత యూపీఐ లైట్ కు మద్దతిచ్చే బ్యాంక్ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యాప్లో మీ వ్యాలెట్లో2 వేల వరకు డబ్బులు జమ చేసుకోవచ్చు. అలాగే రూ. 200 లోపు ట్రాన్సాక్షన్లకు ఎలాంటి పిన్ అవసరం లేదు. ఆ పేమెంట్ పైబడితే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే సులభంగా మీ క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితమే. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే.. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి.. డౌన్కి వెళ్లాలి. ఇక్కడ సిబిల్ స్కోర్ చెక్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే.. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చెక్ యువర్ స్కోర్ నౌ అని కపినిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాన్ కార్డులోని పేరు ఎంటర్ చేసి.. కంటిన్యూపై క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డు నంబర్ అడుగుతుంది.. ఎంటర్ చేయాలి. అలాగే ఈ మెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేశాక.. కంటిన్యూ అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. అంతే.. మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది.