ఇటీవల పలు దేశాల్లో పలు రకాల రసయాయన ఫ్యాక్టరీల్లో అకస్మాత్తుగా పేలుడు సంబవించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..
ఇటీవల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది. ఇలాంటి సంఘలనలు ప్రపంచంలో పలు చోట్ల జరుగుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియా రాజధాని జకర్తాలో శనివారం తెల్లవారుజామున ఓ ఇంధన నిల్వ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ ఫ్యాక్టీరీ కావడంతో మంటలు నిమిషాల్లో పెద్ద ఎత్తున వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకొని 52 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహ 16 మంది దుర్మరణం చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.
ఇండోనేషియా ఉత్తర్ జకర్తాలలోని తనహ్ మేరా ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పెర్టమినా ఆయిల్, గ్యాస్ కంపెనీ ఉంది. ఇండోనేషియాకు ఇంధన అవసరాల్లో 25 శాతం ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. శనివారం తెల్లవారుజామున ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంబవించింది. రసాయణ ఫ్యాక్టరీ కావడంతో మంటలు క్షణాల్లో మిన్నంటిపోయాయి.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదాన్ని పసికట్టిన అధికారులు చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని అర్జెంట్ గా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా, శుక్రవారం ఇక్కడ భారీగా వర్షాలు పడ్డాయి.. ఆ సమయంలో పైప్ లైన్లు పగిలిపోవడం వల్ల మంటలు చెలరేగాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పిడుగు పాటు వల్ల ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పెర్టమినా ఏరియా మేనేజర్ ఎకో క్రిస్టియావాన్ చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల దేశ ఇంధన సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
ఈ ఘటనపై ఆ దేశ పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి స్పందించి.. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అలాగే ఈ అగ్ని ప్రమాదం పై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, సహాయర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ప్రమాదం గతంలో కూడా జరిగింది. 2014 లో ప్లంపాంగ్ ఫ్యూయల్ డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భవిష్యత్ లో ఇలాంటి అగ్రి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
[News] At least 17 dead in fuel depot fire in Jakarta https://t.co/fyAcff804c https://t.co/mKpt26wqDk
— BERNAMA (@bernamadotcom) March 4, 2023