దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.
దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.
రైలులో ప్రయాణించేటపుడు పెట్రోలు, గ్యాస్ వంటి అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తీసుకెళ్లకూడదని రైల్వే డిపార్ట్ మెంట్ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు కన్నూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆ సమయంలో రైలులో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఓ కోచ్ పూర్తిగా దగ్థమైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికి కూడా ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గత నెల రోజుల క్రితం కూడా ఇదే ట్రైన్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిగారు. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలులో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు సేకరించేందుకు సిసిటివి ఫుటేజీని పరిశీలించారు. ఆ వీడియోల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగి ఉన్న ట్రైన్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆ తరువాతనే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. జరిగిన ఘటనపై అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయా, ఇతరత్రా కారణాల దృష్ట్యా ఫోరెన్సిక్ బృందం, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.