గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఈ భూకంపం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ అనే నగరానికి సుమారు 48 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని పేర్కొన్నారు. దక్షిణ సుమత్రలోని నాలుగు జిల్లాల్లో ఈ భూకంప ప్రభావం కనిపించింది. 3 నుంచి 10 సెకన్ల వరకు భూమి కంపించినట్లు వాతావరణ శాఖ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. భారీ స్థాయిలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇటీవల ఇండోనేషియాలో పలుమార్లు భూకంపాలు సంబవిస్తున్నాయి. వారం క్రితం తనింబర్ పరిసర ప్రాంతంలో భూకంపం సంబవించింది.. రిక్టర్ స్కేల్ పై దీని ప్రభావం 7.7 గా నమోదు అయ్యింది. భారత దేశంలో కూడా పలు మార్లు భూకంపాలు వస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూ ప్రకంపనలు రావడంతో ప్రభలు భయాందోళనకు గురయ్యారు. కాకపోతే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు.
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FANI%2Fstatus%2F1614777489632694273&widget=Tweet