ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ లో గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం పెను ప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భూకంప ధాటికి 50 వేల మంది చనిపోయారు.. కోట్ల నష్టం వాటిల్లింది. భారత్ లో కూడా ఈ మద్య వరుసగా భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం మధ్యహ్నాం 1.30 తర్వాత భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకాశ్మిర్ లోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉత్తరాధిన ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్ తో పాటు మణిపూర్ లో సైతతం పది సెకన్ల పాటు భూమి కంపించింది. శ్రీనగర్ లో ఒక్కసారిగా భూమి కంపించడంతో పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు భయంతో వణికిపోయారు. క్లాస్ రూంల నుంచి బయటకు పరుగులు తీశారు. మార్కెట్ లో ఉన్న షాపు యజమానులు, ఇళ్లల్లో ఉన్నవాళ్లు భయంతో బయటకు వచ్చారు. గత నెలలో కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్లోని లాహోర్లో పరిసర ప్రాంతాల్లో సైతం భూ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.
#WATCH | An earthquake of 5.4 magnitude was recorded in J&K’s Doda today. Tremors might have been felt in HP, Chandigarh, Punjab and all adjoining areas. Maybe the aftershock will be of lesser magnitude than the main shock: Dr OP Mishra, Director, National Center for Seismology pic.twitter.com/vFHBeu5XVW
— ANI (@ANI) June 13, 2023