ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం ప్రళయాన్ని జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ప్రపంచంలో పలు దేశాల్లో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. భూకంప ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ భూకంప ధాటికి 50 వేల మంది చనిపోయారు.. కోట్ల ఆస్తి నష్టం జరిగింది. తాజాగా ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం గజ గజ వణికించింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో ఫిలిప్పీన్స్ లో పలుమార్లు భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఫిలిప్పిన్స్ ను భారీ భూకంపం వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లో మిండోరి ద్వీపంలో గురువారం ఉదయం భూమి ఒక్కసారే కంపించిందని.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెన్స్ తెలియజేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5 గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
దేశ రాజధాని మనీలా కు దాదాపు 124 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైన ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం పై ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల భారత్ లో కూడా పలు చోట్ల వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే ఉత్తరాదిని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు.
An #earthquake measuring 6.5 on the Richter scale struck Mindoro island in the northern #Philippines on Thursday. https://t.co/vzCrtqRc5T
— IndiaToday (@IndiaToday) June 15, 2023