ఈ మద్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస భూకంపాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో టర్కీ, నైజీరియాలో వచ్చిన భూకంపంలో 50 వేల మంది చనిపోయారు.. ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరీలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. వరుస భూకంపాల ధాటికి ఇక్కడ ఏకంగా 50 వేల మంది చనిపోయారు.. కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు. తాజాగా ఫిజీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రపంచంలో పలు చోట్ల భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే టర్కీ, సిరియా లో సంభవించిన భూకంపాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. తాజాగా ఓనియానియా దేశం.. ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్విప దేశం ఫిజీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.9 గా నమోదు అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించారు. ఇది భూమికి 8 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రాంతంలో ఉన్న ఓషియానియా దేశంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
సముద్ర అడుగ భాగంలో ఉన్న అగ్ని పర్వతాలు బద్దలు కావడంతో పలుమార్లు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఒక్క ఫిజీలోనే కాదు.. టోంగా, న్యూజిలాండ్, హవాయ్, వనౌతు లాంటి ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని అంటారు. ఇది ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అగ్ని పర్వతాలు బద్దలు కావడం… భూమి కంపించడం లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ ప్రాంతాల్లో సునామీలు కూడా సంభవిస్తుంటాయి.
Magnitude 5.9 earthquake strikes Fiji regionhttps://t.co/nB19piteaG pic.twitter.com/qHjcTuT1QH
— Hindustan Times (@htTweets) June 10, 2023