ఇటీవల ప్రపంచంలో వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
ఇటీవల ప్రపంచంలో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంప ప్రభావంతో 50 వేల మంది చనిపోయారు.. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత దేశంలో పలు చోట్ల భారీగా భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8:15 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఎన్సీఎస్ ప్రకారం.. చాంగ్లాంగ్కు ఆగ్నేయంగా 86 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు. భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ అయిన ఎన్సిఎస్ ట్విట్టర్లో తెలిపింది. అంతకు ముందు మే 20న రిక్టర్ స్కేల్పై 3.2గా నమోదైన భూకంపం మణిపూర్లోని షిరుయ్ గ్రామాన్ని కుదిపేసింది. మణిపూర్లోని షిరుయికి వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో రాత్రి 7:31 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ‘మణిపూర్లోని షిరుయ్కు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో రాత్రి 7.31 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం యొక్క లోతు 31 కిలోమీటర్లు’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ప్రకటనలో తెలిపింది.
మయన్మార్ లో నేడు ఉదయం 8.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.5 గా నమోదు అయినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కొన్ని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇక ఉత్తర కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. హంబోల్ట్ కౌంటీ పెట్రోలియా కు పశ్చిమ దిశంలో 108 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లుగా యూఎస్జీఎస్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 19న కలెడోనియాకు తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత రోజు ఉదయం అదే ప్రాంతంలో 7.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. న్యూ కలేడోనియన్ ద్విప సమూహానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యూఎస్జీఎస్ వెల్లడించింది. దీని వల్ల పలు ద్వీప దేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసి పరిసర ప్రాంతాల వారికికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Earthquake of Magnitude:4.5, Occurred on 22-05-2023, 08:15:39 IST, Lat: 27.05 & Long: 97.04, Depth: 14 Km ,Location: 86km SSE of Changlang, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/fYF7WY56xU @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/qJ3BcBB0fL
— National Center for Seismology (@NCS_Earthquake) May 22, 2023