కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. కొవిడ్ కంటే ముందు వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. గత మార్చి నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాటమ్ అవుట్ అయిందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో మంచి రికవరీ కనబడుతోందని తెలిపింది. కోవిడ్ 19 కారణంగా 2020లో రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అప్పటికే ఉన్న కష్టాలు రెట్టింపయ్యాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం భారీగా తగ్గడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఫ్రభావం చూపుతోంది. అందుకే ప్రభుత్వం లాక్డౌన్పై ఆసక్తి కనబర్చలేదు. అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో బుధవారం నుంచి లాక్డౌన్ విధించింది. దీంతో ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక మందగమనం వల్లే ఆస్తుల క్రయవిక్రయాలు భారీగా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు
మధ్య తరగతి వర్గాలు ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి కనబరచకపోవడంతో ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోళ్లు ఇటీవల బాగా తగ్గిపోయాయి. అయితే, వ్యాపారస్తులు, బడా వ్యక్తులు మాత్రం ఎకరాల్లో భూములు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే, కరోనా రెండో వేవ్ ఉధృత రూపం దాల్చడంతో ఇటీవల అన్ని వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ దూకుడు కూడా తగ్గింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఈ జిల్లా నుంచే వస్తోంది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో మార్చి నెలలో రూ.297.19 కోట్ల ఆదాయం రాగా.. ఏప్రిల్లో రూ.195.53 కోట్లే వచ్చింది. అంటే ఒక్క నెలలోనే రూ.100 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే ఈ నెల 10 వరకు రూ.31.32 కోట్లే వచ్చింది. లాక్డౌన్ వల్ల ఈ నెలలో ఆదాయం రూ.100 కోట్లు చేరడం కష్టమే. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే విలువైన స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా సింహభాగం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది.