స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఇల్లు కొనాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే కోనేయండి. లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
డెవలప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఏరియాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆర్థికంగా ఎదిగే అవకాశం మీ కోసమే. డెవలప్ అవ్వడానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది అని నిరుత్సాహపడకండి. ఎందుకంటే రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే సంవత్సరాలు స్పీడ్ గా వెళ్లిపోతున్నాయి. కాబట్టి ఒక మూడు, నాలుగేళ్లు పెట్టుబడి పెట్టేసి వదిలేస్తే ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కువ ధర పెట్టి పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి. అభివృద్ధి చెందుతున్న దాంట్లో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. వీటి కంటే కూడా అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పద్ధతి. తక్కువ రేట్లకు భూములు కొంటే ఎలాగూ డెవలప్ అయితే మంచి ధర పలుకుతుంది. మీరు కనుక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఏపీలో ఈ ఏరియాలు రెండేళ్లలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
అంగుళం భూమిని కూడా వదులుకోని మనుషులున్న ఈ సమాజంలో ఎకరంన్నర భూమిని తృణప్రాయంగా పేద ప్రజల కోసం వదులుకున్న మహానుభావుడి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఆయన చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
హైదరాబాద్ లేదా వైజాగ్.. ఈ రెండు నగరాల్లో స్థలం ఎక్కడ కొంటే బాగుంటుంది. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంటుంది? డబ్బు పరంగా, స్థలం పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఏ నగరానికి ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.
సిటీలోనే కాదు, పల్లెటూర్లలో కూడా స్థలాలు కొనడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. చాలా మంది మధ్యతరగతి వ్యక్తులు పెద్ద పెద్ద సిటీల్లో స్థలాలు కొనలేక తమ దగ్గర ఉన్న డబ్బుతో సొంత ఊర్లలో స్థలాలు కొంటున్నారు. రెండు, మూడు నెలల్లోనే ఆ రేట్లు పెరిగిపోతున్నాయి. మంచి రేటు వచ్చాక అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. మీరు కూడా తక్కువ రేటుకి పల్లెటూరులో స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి స్మార్ట్ సిటీలను డెవలప్ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో అమరావతి, కాకినాడ, వైజాగ్, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనుంది. స్మాట్ సిటీగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంటుంది. అందుకే ఇప్పుడే కొన్ని స్థలాలను కొని పెట్టుకుంటే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మరి ఏ ఏ ఏరియాలు పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా అవతరించనుంది. ఈ కారణంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంటుంది. కాకినాడ ఓడరేవు, ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్ట్రీ హబ్ గా ఉన్న కాకినాడకు మహర్దశ పట్టనుంది.
హైదరాబాద్ లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొనలేకపోతున్నామని బాధపడకండి. హైదరాబాద్ లో కొనడం కంటే ఏపీలో డెవలప్ కానున్న ఏరియాలో కొనడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ధరలు చాలా తక్కువ పలుకుతున్నాయి. అయితే ఏడాదిలో 25 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెబుతున్నారు. ఇది హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు పెరుగుతున్న వృద్ధి రేటు కంటే ఎక్కువ.
వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తున్న ఏరియాలో రూ. 15 లక్షలకే 300 గజాల స్థలం దొరుకుతుంది.