అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో చురుగ్గా పాలుపంచుకునే వైసీపీ ఎన్నారై సభ్యుడు ‘పంచ్ ప్రభాకర్’ పై కేసు నమోదైంది. ఉపరాష్ట్రపతి ‘వెంకయ్యనాయుడు’, లోక్ సభ స్పీకర్ ‘ఓంబిర్లా’పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో ఆయనపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు అయిన ‘పంచ్ ప్రభాకర్’ టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన కుమారుడు ‘లోకేష్’, జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్, వైకాపా రెబెల్ ‘ఎంపి రఘురామకృష్ణంరాజు’ తదితరులను తన వీడియోల్లో అసభ్యంగా దూషించారు.
పంచ్ ప్రభాకర్ పై ఐపీసీ 504,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా ‘పంచ్ ప్రభాకర్’ అప్ లోడ్ చేసిన వీడియోలు గురించి యూ – ట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన అప్ లోడ్ చేసిన వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. యుఎస్ లో ఉంటున్న ‘పంచ్ ప్రభాకర్’ పై కేసు నమోదు చేశామని విచారణ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేసులో విచారించేందుకు’ పంచ్ ప్రభాకర్’ ను ఢిల్లీకి పిలిపిస్తారని తెలుస్తోంది.
యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు.