హరితేజ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సీరియల్ నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సినిమాల్లో సైతం నటించింది. హరితేజ తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘బిగ్బాస్-1’ లో పాల్గొన్ని ఫుల్ క్రేజ్ సంపాందించింది. బిగ్ బాస్ హౌస్ లో హరితేజ చేసిన హరికథ స్క్రిప్ట్ ..ఆమెలోని కొత్త నటిని బయట ప్రపంచానికి చూపించింది. తాజాగా ‘నవరాత్రి ధమకా’ అనే ప్రత్యేక కార్యక్రమంలో మహానటి సావిత్రిగా నటించింది. సావిత్రే నిజంగా మన కళ్లముందుకు వచ్చిందా? అనేంతలా.. హరితేజ ఆకట్టుకుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమో అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
దసరా పండగ సందర్భంగా మల్లెమాల వారు ‘నవరాత్రి ధమాకా’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నవరాత్రి వేడుకలు హైదరాబాద్ లో చేసుకువాలని, లేదు..విజయవాడలో చేసుకోవాలని.. ఇద్దరు నటులు గొడవ పడుతారు. ఇంతలో అక్కడి వచ్చిన యాంకర్ రవి, హైబర్ ఆది సమస్యపై చర్చిస్తారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన పంచ్ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల తారలు ప్రేమ, సంఘవిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. యాంకర్ రవి ‘గుమ్మాడి.. గుమ్మాడి’ అంటూ డాడీ సినిమాలోని పాడిన పాట అందరిని కంటతడి పెట్టించింది. ఇదే క్రమంలో ‘మాయా బజార్’ సినిమాలో సావిత్రి చేసిన పాత్రను ఈ షోలో హరితేజ చేసింది. ఇంకా సావిత్రి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా షోలో కళ్లకు కట్టినట్లుగా హరితేజ చూపించింది. ఆమె నటనకి అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. “చనిపోయిన వాళ్లను గుర్తు చేయండం వేరు. నేరుగా వాళ్లే వచ్చినట్లు చేయడం వేరు. నాకు తెలిసి హరితేజ అలా చేసింది” అని హైబర్ ఆది.. హరితేజను ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.