బుల్లితెరపై అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ఢీ ఒకటి. దాదాపు పదమూడు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షోలో.. ఇప్పుడు పద్నాలుగో(ఢీ 14) సీజన్ కొనసాగుతోంది. ఈ షోని కొన్నేళ్ల నుండి యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తుండగా.. జడ్జి స్థానాలలో మాత్రం మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ షో ప్రతి బుధవారం ప్రసారమవుతుంది. తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. ఈ ప్రోమోలో నటి పూర్ణ, గణేష్ మాస్టర్, ఆని మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తూ కనిపించారు. ఇక ప్రోమో అంతా మంచి పెర్ఫార్మన్స్ లతో హుషారుగా సాగింది.
ప్రోమో మధ్యలో హైపర్ ఆది, శ్వేతాకి మధ్య డాన్స్ పెర్ఫార్మన్స్ పోటీ జరిగింది. హైపర్ ఆది, శ్వేతా ఇద్దరిలో ఎవరు పెర్ఫార్మన్స్ బాగుందో జడ్జిలను అడగ్గా.. పూర్ణ శ్వేతా పెర్ఫార్మన్స్ బాగుందని చెప్పింది. దీంతో వెంటనే హైపర్ ఆది.. “ఫస్ట్ టైమ్ నాకు మీ జడ్జిమెంట్ నచ్చలేదు’ అన్నాడు. పూర్ణ అందుకొని.. ‘నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు’ అంది. అందుకు ఆది.. “నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు’ అన్నాడు. ఆ వెంటనే పూర్ణ.. ‘సిగ్గుంటే వెళ్లు.. సిగ్గు లేదంటే ఉండు.. నోరు మూసుకొని వెళ్లి కూర్చో’ అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరగనుందో!