తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ ఢోకా లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ఉన్నా కానీ.. పలు ఛానెళ్లల్లో వచ్చే రెగ్యులర్ సీరియల్స్తో పాటు.. డిఫరెంట్ రియాలిటీ షోస్, ఫన్నీ ప్రోగ్రామ్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ ఢోకా లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ఉన్నా కానీ.. పలు ఛానెళ్లల్లో వచ్చే రెగ్యులర్ సీరియల్స్తో పాటు.. డిఫరెంట్ రియాలిటీ షోస్, ఫన్నీ ప్రోగ్రామ్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి. వీటి ద్వారా పాపులర్ అయ్యి, టీవీల నుండి సినిమాల వైపు వెళ్లి సెటిల్ అయినవాళ్లు చాలా మందే ఉన్నారు. నవ్వులతో కడుపు నొప్పి తెప్పించే వాళ్లల్లో హైపర్ ఆది ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ‘ఢీ’ లాంటి షోస్లో తన స్టైల్ పంచ్లతో పిచ్చెక్కిస్తుంటాడు. సినిమాల్లోనూ మంచి క్యారెక్టర్స్ చేస్తూ.. సినిమా ఫంక్షన్లలో స్పీచ్లతో ఆకట్టుకుంటూ స్టార్ కమెడియన్గా జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు.
రష్మీ హోస్ట్ చేస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆదివారం (జూలై 30)న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఆది ఎప్పటిలానే తన కామెడీతో రచ్చ రంబోలా చేశాడు. ఈసారి టీవీ, సినీ నటులందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన వంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ యాక్ట్రెసెస్తో పాటు ప్రజెంట్ యాంకర్లను, యాక్టర్లను రంగంలోకి దింపి తెగ నవ్వించేశాడు. ‘ఆది కిడ్నాప్’ అనేది ఈ ఎపిసోడ్లో హైలెట్ కానుంది.
ఆడవాళ్ల మీద పంచ్ లేస్తున్నాడని, ఆడవాళ్లకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని.. ఆడాళ్లంతా కలిసి ఆదిని కిడ్నాప్ చేసి, సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మీరంతా నిజంగా ఎంటర్టైన్ చెయ్యండి.. సారీ ఏంటి?.. పొర్లుదండాలు పెడతానంటూ సవాలు విసిరాడు ఆది.. ఇక అక్కడి నుండి ప్రోమో టెంపో అమాంతం పెరిగిపోయింది. శిల్పా చక్రవర్తి, భావన తమ డ్యాన్స్తో షాక్ ఇచ్చారు. డిఫరెంట్ టాస్కులు, పర్ఫార్మెన్స్లు అదిరిపోబోతున్నాయని ప్రోమోతో హింట్ ఇచ్చారు. పొలం పనులు చేసే మహిళలు కూడా ఆదిని పెళ్లెప్పుడు అని అడగడం హైలెట్ అసలు. ముఖ్యంగా ఇంత మంది ఫీమేల్ ఆర్టిస్టులంతా ఒకే చోట కనిపించడం అనేది ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేసింది.