సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలు.. కథల విషయంలో వస్తే.. ఆ తర్వాత పారితోషికం విషయంలో వస్తాయి. చాలామంది నటులు సినిమా పూర్తయి.. విడుదలైన తర్వాత కూడా తమకు రావాల్సిన పారితోషికం అందలేదని.. డబ్బులు ఎగొట్టారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే చాలా మంది దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. తరువాత అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో కామ్గా ఉంటారు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. వారు ఊరుకుంటారా. లేదు.. కోర్టుకు వెళ్లి మరి డబ్బులు వసూలు చేసుకుంటారు. తాజాగా ఇదే పని చేస్తున్నారు.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. తనకు ఇస్తానన్న రెమ్యూనరేషన్లో రూ.4 కోట్లు ఇంకా ఇవ్వలేదని.. నిర్మాత మీద మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ట్రెండ్ సృష్టిస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్.. లిరిక్స్ ఎలా రాశారు?
శివ కార్తికేయన్, నయనతార జంటగా నటించిన సినిమా ‘మిస్టర్ లోకల్’. దీనికి కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మాత. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. మే 17, 2019న విడుదలైంది. మూడేళ్ళ క్రితం విడుదలైన సినిమాకు సంబంధించి తాజాగా ఓ వివాదం వెలుగలోకి వచ్చింది. ఏంటి అంటే.. సినిమా అంగీకరించినప్పుడు నిర్మాత జ్ఞానవేల్ రాజా తనకు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారట. కానీ 11 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని.. మరో నాలుగు కోట్లు ఇంకా ఇవ్వలేదని.. ఇచ్చిన డబ్బులకు కూడా టీడీఎస్ కట్టలేదని శివ కార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో కేస్ వేశారు.
ఇది కూడా చదవండి: ‘కండోమ్ టెస్టర్’గా రకుల్ ప్రీత్ సింగ్.. షాకింగ్ రోల్!ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ‘రెబల్’, ‘చియాన్ 61’, ‘పత్తు తల’ సినిమాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, అలాగే థియేట్రికల్ అండ్ ఓటీటీ రైట్స్ అమ్మకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును శివ కార్తికేయన్ కోరారు. ‘రెమో’, ‘శక్తి’, ‘సీమ రాజా’, ‘వరుణ్ డాక్టర్’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా విజయాలు అందుకున్న శివ కార్తికేయన్, ఇప్పుడు ‘జాతిరత్నాలు’ ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెలుగు – తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు.