ఇండియాలో కొత్తగా 39,070 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 491 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేరళలో పరిస్థితి బాగోలేదు. ఇది థర్డ్ వేవే అని చాలా మంది అంటున్నారు
మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఇది 2.12 శాతంగా ఉంది.ఇండియాలో కొత్తగా 43,910 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,10,99,771కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి.
మొత్తం కేసుల సంఖ్య 3, 19, 34, 455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది. దేశంలో 50,68,10,492 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. గత 24 గంటల్లో 55,91,657 మందికి వ్యాక్సిన్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.