పోసాని కృష్ణమురళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్తగా రాణిస్తున్నారు. ఇక తాజాగా పోసాని అస్వస్థతకు గురయ్యాడు. ఆ వివరాలు..
నాలుగేళ్ల క్రితం భూమ్మీదకు వచ్చిన కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోలేదు. దశల వారీగా.. రూపం మార్చుకుంటూ.. జనాల మీద దాడి చేస్తోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు ఒక్క రోజే ఏకంగా 10 వేలు కేసులు నమోదయ్యాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అయితే కరోనా తొలినాళ్లల్లో ఉన్నంత తీవ్రంగా ప్రస్తుతం ఉండటం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డా త్వరగానే కోలుకుంటున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నడుటు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఆ వివరాలు..
నటుడు, ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళీకి కరోనా బారిన పడ్డారు. దాంతో ది. పోసాని కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా పోసాని.. పుణెలో జరిగిన షూటింగ్లో పాల్గొని గురువారం హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాస్త అస్వస్థగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. పోసాని కృష్ణ మురళికి కరోనా రావడం ఇది మూడోసారి. ఇక తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
పోసాని ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి, నంది అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు ఏపీ సీఎం జగన్ మీద పీకల దాక కోపం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వల్ల.. రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు లబ్ధి కలుగుతుంది. అందుకే ఆయన గెలవాలని కోరుకుంటారు అన్నారు. తాను ఇలా మాట్లాడితే.. మహా అయితే తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా చేయగలరేమో. కానీ తాను వాటికి భయపడను. తాను వెల్ సెటిల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పోసాని త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.