బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువులో మంచి ప్రతిభ కనబరిచాడు. అతడి తెలివితేటలకు మంచి ఉద్యోగం వచ్చేది. కానీ మనోడికి.. ఇలా నెలంతా కష్టపడి జీతం తీసుకోవడం నచ్చలేదు. జీవితాంతం సరిపడా డబ్బులను.. కొన్ని రోజుల్లోనే సంపాదించాలని భావించాడు. దానికోసం మనోడు వేసిన ప్లాన్ గురించి వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఉద్యోగాలు వేస్ట్ అనుకున్న సదురు వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి.. బెదిరింపులకు దిగాడు. అలా ఇప్పటివరకు ఏకంగా 2.5 కోట్ల రూపాయలు వరకు వసూలు చేశాడు. అలా వచ్చిన డబ్బుతో గర్ల్ఫ్రెండ్కు ఏకంగా 80 లక్షల ఖరీదుతో ఖరీదైన బంగ్లా కొనిపించాడు. కానీ చివరకు ఓ ఎమ్మెల్యే ఫిర్యాదుతో.. ఇతగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Neil Parish: పార్లమెంటులో బరితెగించిన ఎంపీ.. అశ్లీల వీడియోలు చూస్తూ!
విశాఖపట్నంకు చెందిన పి.విష్ణుమూర్తి (20) అలియాస్ సాగర్ యువకుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. తక్కువ కాలంలో ఎక్కవ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్లాక్మెయిల్కు తెర తీశాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్కు చెందిన ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు పలుమార్లు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, వెంటనే రూ. 20 లక్షలు పంపాలని కోరాడు. దాంతో అనుమానం వచ్చిన ఆ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన బివాడీ పోలీస్ స్టేషన్కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేంద్రసింగ్ నేతృత్వంలో సిబ్బంది మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గాజువాక శ్రీనగర్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్పై నిందితుడిని రాజస్థాన్ తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: Y.S. Jagan Mohan Reddy: రేపల్లే అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్!కాగా, సీఎంవో నుంచి మాట్లాడుతున్నానంటూ విష్ణుమూర్తి రాజస్థాన్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి దాదాపు రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ. 80 లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఒక ఖరీదైన ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్ క్రైమ్, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ. 1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Mahabubabad: ప్రియుడితో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని తండ్రిని చంపేసిన కూతురు!