తేనె పూసిన కత్తి స్మూత్గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే… కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్) స్మూత్గా ఉంది కదా అని టచ్ చేస్తే వల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎన్నో కేసులు చదివాం. అలాగే మరోహటి ఇప్పుడు. ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో పిర్యాదు చేశాడు బాధితుడు. పోలీస్ డిపార్ట్ మెంట్ పేరు చెప్పుకుంటూ డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి మోసం చేస్తుందని తెలిపాడు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్ మోసం చేసి గతంలో ముగ్గురిని పెళ్లాడిందని అందులో ఇద్దరికి విడాకులు ఇవ్వగా, మరొకరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు షాబాద్ మండలం, హైతబాద్ కు చెందిన నన్ను ట్రాప్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. హనీ ట్రాప్ గురించి చాలామందికి తెలిసిందే. అందంగా కనిపించి, కవ్విస్తారు. రహస్యాలు రాబడతారు. లేదంటే సీక్రెట్ గా కెమెరాలు పెడతారు. ఇక ఆ తర్వాత అసలు బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతారు. మరి ఇవే పనుల్ని ఓ లేడీ కానిస్టేబుల్ చేస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ లో బయటపడింది ఈ లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్ వ్యవహారం. గత వివాహాల విషయం తెలికుండా నమ్మబలికించి తనను పెళ్లి చేసుకుందని.. ఇలాగే ఎంతో మందిని మోసం చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంధ్యారాణికి డబ్బున్నోళ్లను టార్గెట్ చేయడం అలవాటు. మెల్లగా ట్రాప్ లోకి లాగి తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంది. అలా ఇప్పటికే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంది. ఈ ముగ్గుర్లో ఒకరు ఈమె బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటే, మరో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు శంషాబాద్ మండలానికి చెందిన చరణ్ తేజ్ ను ట్రాప్ చేసింది సంధ్యారాణి. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజ్ ను మెల్లగా ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంది. ఆర్య సమాజంలో తప్పు సాక్ష్యాలు సృష్టించి మరీ చరణ్ తేజ్ ను పెళ్లాడిన సదరు కానిస్టేబుల్, ఇప్పుడు అతడికి చుక్కలు చూపిస్తోంది.
సంధ్యారాణిని పెళ్లి చేసుకున్న తర్వాత చరణ్ తేజ్ కు అసలు విషయం తెలిసింది. ఆమెకు ఇప్పటికే 3 పెళ్లిళ్లు అయ్యాయని, రెండేళ్ల పాప కూడా ఉందనే విషయం తెలుసుకున్నాడు. అంతలోనే సంధ్యారాణి అతడ్ని హౌజ్ అరెస్ట్ చేసింది. బయటకు చెబితే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించింది. అంతేకాదు మతమార్పిడి చేసుకోమని కూడా బలవంతం పెట్టసాగింది. దీంతో అతడు శంషాబాద్ డీసీపీకి కంప్లయింట్ చేశాడు. 7 నెలలుగా ఇంట్లో నిర్బంధంగా ఉన్న తనను విడిపించమని కోరాడు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు చరణ్ తేజ్. ఇందులో నిజాలు వెలికితీసే ప్రక్రియ మొదలయ్యింది.