మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా అప్పటి వరకూ ఉచితంగా అందించిన సేవలకు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి సోషల్ మీడియా సంస్థలు. ఇప్పటికే ట్విట్టర్ వినియోదారులకు సంబంధించి ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ బాటలోనే మార్క్ జుకర్ బర్గ్ కూడా నడవనున్నారు. ట్విట్టర్ బాటలోనే మెటా సంస్థ కూడా నడవనుంది. ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లే మెటా సంస్థ కూడా నెలవారీ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. మార్క్ జుకర్ బర్గ్ ఆదివారం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి బ్లూ టిక్ వెరిఫికేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని ఆయన వెల్లడించారు. బ్లూ టిక్ కావాలనుకునే వారి ఖాతాలను ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వెరిఫై చేసి బ్లూ టిక్ ఇస్తామని ఆయన అన్నారు. ఈ బ్లూ బ్యాడ్జ్ వల్ల ఖాతాల నకిలీ ఖాతాల నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. ఈ కొత్త ఫీచర్ వల్ల వినియోగదారులకు అధికారిక ఖాతాల పట్ల విశ్వసనీయత పెరుగుతుందని, రీచ్ కూడా పెరుగుతుందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భద్రత ఉంటుందని అన్నారు. మెటా వెరిఫైడ్ సేవలు కావాలనుకునే వినియోగదారులు నెల నెలా ఛార్జీలు చెల్లించాలని ఆయన అన్నారు. వెబ్ యూజర్లు ఐతే నెలకు 11.99 డాలర్లు చెల్లించాలని, ఐఓఎస్ యూజర్లు ఐతే 14.99 డాలర్లు చెల్లించాలని కీలక ప్రకటన చేశారు.
తొలుత ఈ విధానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అవలంభిస్తామని, ఈ వారంలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరిస్తామని అన్నారు. అంటే ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే భారతీయులు బ్లూ టిక్ కావాలంటే.. ఒక్కో ప్లాట్ ఫార్మ్ కి నెలకు రూ. 990 నుంచి రూ. 1240 చెల్లించాలన్నమాట. ఇప్పటి వరకూ ప్రకటనల మీద వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకున్న మెటా సంస్థ.. ఇక నుంచి బ్లూ టిక్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తుంది. మరి మెటా సంస్థ బ్లూ టిక్ కోసం ఛార్జీలను వసూలు చేయనుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.