ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచతూ వినియోగాదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి BSNL.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీగా నిలబడేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు అందించిన ప్లాన్స్ రేటు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాలిడిటీ కూడా 28 రోజులకే పరిమితం. అయితే BSNL కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది.
ఇక BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్ విషయానికి వస్తే.. రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్ కింద ప్రతిరోజు 80kbps ఇంటర్నెట్ స్పీడ్ తో 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇక్కడో షరతు ఉంది. ఈ ప్రయోజనాలకు 18 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నా.. ఔట్ గోయింగ్ కాల్స్, ఇంటర్నెట్ కోసం టాప్ అప్ వేయించుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
వినియోగదారులకు సుదీర్ఘ వ్యాలిడిటీ అందించడమే లక్ష్యంగా BSNL ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే 18రోజుల తర్వాత టాప్ అప్ వేయించుకోకపోయినా.. ఉచిత ఇన్ కమింగ్ సౌకర్యం మాత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. 18రోజుల తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbps ఉంటుంది. మరి ఈ BSNL ప్రకటించిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.