బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న వివాదాల సంగతి పక్కన పెడితే.. హౌస్ లో కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు మాత్రం నెటిజన్లకు కోపం తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే.. నామినేషన్స్ టైంలో అంతలా గొడవపడే సభ్యులు.. ఖాళీ టైంలో సేదతీరుతున్నారు ఓకే. కానీ ఇద్దరు లేడీ సభ్యులు కలిసి ఒక మేల్ కంటెస్టెంట్ కి బాడీ మసాజ్ చేయడం పై కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని బెడ్ పై పడుకోబెట్టి స్రవంతి చొక్కారపు కాలుతో తొక్కుతూ మసాజ్ చేసింది.. ఆ వెంటనే తేజస్వి వచ్చి అఖిల్ ని కూర్చోబెట్టి మసాజ్ చేసింది. ఇద్దరూ కూడా ఫ్రెండ్లీగానే మసాజ్ చేసినప్పటికీ ప్రేక్షకులు మాత్రం.. ఇక వీళ్ళు కూడా మొదలు పెట్టేశారంటూ మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.