తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ OTT సీజన్-1 శనివారంతో ముగిసింది. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ విన్నర్ గా నిలించింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేత ట్రోఫి తెలుగమ్మాయి బిందుమాధవి గెలుచుకుంది. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. అయితే అఖిల్ రన్నర్ గా నిలవడంపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్-4లో రన్నరప్ టైటిల్ గెలిచిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ నానాస్టాప్ ఓటీటీలోనూ రన్నరప్ గా నిలిచి విజయానికి అడుగు దూరంలో ఆగిపోయాడు.అయితే తాను రన్నర్ గా నిలవడం బాధలేదని.. బందు గెలినా సంతోషంగా ఉందని అఖిల్ అన్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత తొలిసారిగా మీడియా ముందు అఖిల్ మాట్లాడాడు.
అఖిల్ మీడియాతో మాట్లాడుతూ…” నేను రన్నర్ గా అయిన కూడా విన్నర్ లాగే మావాళ్లకు పార్టీ ఇస్తాను. నాకు ఎలాంటి బాధలేదు. బిందు టైటిల్ విన్నర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను విన్నర్ కానందుకు ఏడ్చేశాని కొందరు రాశారు. కానీ నేను అలాంటి పని ఏమి చేయలేదు. గతంలో ఓసారి దెబ్బ తిన్న కాబట్టి ఇప్పుడు అంత తేడా ఏమి అనిపిచలేదు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో నేను చాలా తక్కువ మిస్టేక్ లు చేశాను. నాగార్జున గారు మెచ్చుకోవడమే అందుకు నిదర్శనం. ఆయన చెప్పారంటే అది ఆయన మాట కాదు.. ఆడియన్స్ మాట.
ఇదీ చదవండి:టైటిల్ గెలిచిన తర్వాత.. అభిమానులను తలుచుకుని బిందు మాధవి ఎమోషనల్!
చివరి వారంలో నేను బిందుమాధవి చాలా క్లోజ్ అయిపోయాము. మొదట్లో ఎంత ప్రయత్నించిన బిందుకు దగ్గర కాలేకపోయాను. చివరి వారంలో మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం అయినాము. ఆమె మంచి విజయం కోసం ఎదురు చూస్తుంది. చివరికి ఈ సక్సెస్ అందుకుని ఆమె కళ నిరవేర్చుకుంది. బిందు మాధవి విన్నర్ అవుతుందా? లేదా అని నేను ఆలోచించలేదు. ఎందుకంటే నేను నా గురించి మాత్రేమే ఆలోచించాను. నేను గెలవాలనే ఆట ఆడాను.. అలానే ముందుకు వెళ్లాలి.. విన్నర్ అవ్వాలి అనుకున్నా.. కానీ అది జరగలేదు.
హౌస్ లో నా బెస్ట్ కంటెస్టెంట్ తేజస్విని. శ్రీరాపాక నాకు బాగా సపోర్టు చేసింది. అందుకు ఆమె కూడా నా బెస్ట్ కంటెస్టెంట్. మాములు బిగ్ బాస్ షోకి ఓటీటీ షోకి చాలా తేడా ఉంది. ఓటీటీలో పర్సనాలిటీ క్లియర్ గా తెలుస్తుంది” అంటూ అఖిల్ సార్థక్ చెప్పుకోచ్చారు.మరి..అఖిల్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.