మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు అధిష్టానం మీద పరోక్షంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. మరి ఇంతకి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరో? ఎందుకు కూర్చున్నాడో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఇక అసెంబ్లీ సమావేశాలు మెుదలైన తొలిరోజే.. ఓ ఆసక్తికర సంఘటనకు అసెంబ్లీ వేదికైంది. అసలు విషయం ఏంటంటే? అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. YSRCP ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల పక్కన కూర్చోకుండా.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నాడు. దాంతో అక్కడున్న వైసీపీ నాయకులు అంతా కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ దృశ్యం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని రోజులుగా ఆనం వైసీపీపై ఘాటుగా విమర్శలు చేస్తూ.. వస్తున్నారు. ఏపీ అన్ని వ్యవస్థలు దిగజారిపోయి, విలువలు లేకుండా పోయాయని, పోలీసులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేశాడు.
దాంతో అతడి వ్యాఖ్యలపై వైఎస్ ఆర్సీపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఆనం ను వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఇక అప్పటి నుంచి తన మాటలకు పదును పెట్టారు ఆయన. దాంతో అనం పార్టీ మారడం ఖాయమనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యుల వైపు కాకుండా ఆనం టీడీపీ సభ్యుల వైపు కూర్చోడం ఆసక్తికరంగా మారింది. దాంతో ఆనం నెక్ట్స్ స్టెప్ ఏంటో అంతుచిక్కడంలేదు. మరి ఆనం టీడీపీ సభ్యుల్లో కలిసిపోయి కూర్చోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.