ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు.. ఏకంగా స్పీకర్తోనే దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
జగన్ ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్ను పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ను రూపొందించింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏయే శాఖలకు ఎంత ఇచ్చారంటే..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలానే ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపైనే ఆయన విమర్శలు చేశాడు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి కోటంరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.