తూర్పు గోదావరి జిల్లా అనపర్తి దేవీ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయగా.. వాగ్వాదం నెలకొంది.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి దేవీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన భారీ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ జనసందోహంగా అక్కడకు చేరుకోవడంతో పోలీసులను అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని అడ్డుకుంటూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. పర్మిషన్ ఉన్నా కూడా బారీ కేడ్లను ఏర్పాటు చేయడంపై పోలీసులను ప్రశ్నించారు. వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.
అనపర్తి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పోలీసుల నుండి పర్మిషన్ కూడా తీసుకున్నారు. చంద్రబాబు టూర్ ఉందని తెలిసి కూడా బారికేడ్లను ఏర్పాటు చేయడమేమిటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మాజీ హోం మంత్రి చిన్న రాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమల్ల రామకృష్ణా రెడ్డి కూడా ఈ సభ నిర్వహించేందుకు పర్మిషన్లు తెచ్చారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలను అడ్డుకోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఉన్నా కూడా అనుమతించకపోవడంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అడిగితే ఇప్పుడు పర్మిషన్ లేదంటున్నారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అదేమంటే.. సభా స్థలిని మార్చుకోవాలని అంటున్నారని తెలిపారు.
కేవలం సభను నిర్వహించకుండా చూసేందుకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇప్పుడికిప్పుడు సభా స్థలిని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్న నేతలపై కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారని అంటున్నారు. ఎక్కడా లేని ఆంక్షలు అనపర్తిలోనే ఎందుకు అంటూ వాపోయారు. బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.